ఏపీలో భక్తులపై ఏనుగుల పంజా-ముగ్గురి మృతి, మరో ఇద్దరు-10 లక్షల ఎక్స్ గ్రేషియా.!
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పెనువిషాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాల కోన వద్ద ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. వరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. దీంతో భక్తులు తప్పించుకునే పరిస్ధితి లేకపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు.
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రేపు శివరాత్రి కావడంతో భక్తులు గుండాలకోన ఆలయ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఏనుగులు వారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మరో ఇద్దరిని రైల్వేకోడూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు వై.కోట వాసులుగా తెలుస్తోంది. అటవీ మార్గం కావడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన ఆలయం వద్ద ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే దాడిలో మరికొందరు గాయపడిన ఘటనపై సిఎం విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సిఎం ప్రకటించారు.
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అటవీ ప్రాంతాల్లో ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తుల మృతిపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికీ మెరుగైన వైద్యం సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications