ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు -పోస్టల్ బ్యాలెట్‌తో కౌంటింగ్ షురూ -ఇప్పటికే 3 సీట్లు వైసీపీ ఖాతాలో

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలలకుగానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు రంగం సిద్దమైంది. వివాదాలను ముగిస్తూ, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపును ఆదివారం చేపట్టింది. నగరంలోని సీఆర్‌ రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు ప్రారంభించారు.

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

మమతా బెనర్జీ అనూహ్య ఎత్తుగడ -టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక - బెంగాల్‌కు కొత్త సీఎం?మమతా బెనర్జీ అనూహ్య ఎత్తుగడ -టీఎంసీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక - బెంగాల్‌కు కొత్త సీఎం?

కౌంటింగ్ ప్రాంగణంలో నాలుగు హాల్స్‌లో 47 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ఒకొక్క టేబుల్‌లో ఒక్కొ డివిజన్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం 64 మంది సూపర్‌ వైజర్లను, కౌంటింగ్‌ అసిస్టెంట్లను 250 మందిని ఏర్పాటు చేశారు. వీరు కాకుండా 500 మంది మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నామని అధికారులు చెప్పారు.

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రారంభం అయిన దగ్గర నుంచి విజేతలను ప్రకటించే వరకు వీడియో కెమెరా ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నానికి కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. తొలుత 50 పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్లింపు అనంతరం డివిజన్ల వారీగా ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి ప్రతీ రౌండ్‌లో1000 ఓట్ల లెక్కిస్తారు. ప్రతీ టేబుల్‌కి 25 ఓట్లని బండిల్‌గా కట్టి 40 బండిల్స్‌గా లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. కాగా,

Eluru Municipal Corporation Election Results: counting begins, jagans ysrcp took lead

Recommended Video

AP Municipal Elections: Minister Alla Nani's Vote Goes Missing In Eluru

షాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూషాకింగ్: జగన్ సర్కార్ అప్పులపై కాగ్ దర్యాప్తు -ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ వినతి -జైలు శిక్ష తప్పదంటూ

ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, ఇప్పటికే మూడు డివిజన్లను జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. మిగిలిన 47 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా, నాలుగు నెలలు ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతున్నది. ఏపీలో 75 మున్సిపాలిటీలకుగానీ తాడిపత్రి తప్ప 74 చోట్ల వైసీపీ గెలవడం, 12 మున్సిపల్ కార్పొరేషన్లకుగానూ 11 కార్పొరేషన్లు జగన్ పార్టీ చేజిక్కించుకోవడం తెలిసిందే. ఏలూరులోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలున్నాయి..

English summary
West Godavari District Eluru municipal Corporation Elections Counting has started on sunday morning at city's CR Reddy Engineering College. Officials say that strict covid protocols have been following and the counting will be completed by noon. amid court issues, four-and-a-half-month suspense is set to end this afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X