కృష్ణా నదిలో దూకి ఈవో అనిత ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?
అమరావతి: గుంటూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొందుగలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఈవో అనితగా పోలీసులు గుర్తించారు.
దైదా ఆలయంతోపాటు గురజాలలో మరో గుడికి కూడా అనిత ఈవోగా పనిచేస్తున్నారు. అయితే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆమెను నవంబర్ 18న ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గురజాల ఆలయ లెక్కల్లో తేడా రావడంతోనే అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

ఈ వ్యవహారంలో విచారణకు కూడా ఆదేశించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, భర్తతో కూడా అనితకు ఈ మధ్య కాలంలో గొడవలు జరగడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనిత ఆత్మహత్యకు పాల్పడిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం స్పందిస్తామని చెప్పారు. ప్రస్తుతం అనితది అనుమానాస్పాద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications