మాజీ సీఎం జగన్ కాన్వాయ్ వాహనాలకు ప్రమాదం.. ఒకదానికి మరొకటి ఢీ !!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా పలువురు గాయపడినట్టు సమాచారం. దీంతో స్వల్ప గందరగోళం నెలకొనగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటన పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కాగా మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. ఆయన పెనమలూరు, ఉయ్యూరు, పామర్రు, గూడూరు ప్రాంతాల మీదుగా పర్యటిస్తూ.. తుపాను వల్ల ధాన్యం, పత్తి, మిరప, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్న రైతుల్ని కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అలానే ప్రభుత్వం అందిస్తున్న సాయం, నష్టపరిహారం విషయాలను జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం వరకు పర్యటన కొనసాగి, సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా తాడేపల్లి చేరుకుంటారు.

ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక రైతులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విజయవాడ నుండి మచిలీపట్నం హైవేపైకి ఎక్కడికక్కడ జనసందోహం కనిపిస్తోంది. జగన్ వాహనాల కాన్వాయ్ హైవేపై ప్రయాణిస్తుండగా.. అభిమానులు రోడ్డు పక్కన నిలబడి స్వాగతం పలుకుతూ నినాదాలు చేస్తున్నారు. భారీగా జనాలు రోడ్డుపైకి రావడంతో పోలీసులు రవాణా వ్యవస్థను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జగన్ టూర్ సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెం ప్రాంతాల్లో మాత్రమే పర్యటించేందుకు జగన్కు అనుమతి ఇచ్చారు. అయితే కాన్వాయ్లో గరిష్టంగా 10 వాహనాలు, 500 మంది మాత్రమే పాల్గొనాలని ఆదేశించారు. బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ సిస్టమ్స్, మైకులు వాడరాదని హెచ్చరించారు. అనుమతి లేకుండా పెద్ద ఎత్తున జనాన్ని తరలించవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఈ ఆంక్షలపై వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే ఇన్ని అడ్డంకులు ఎందుకని?" అని ప్రశ్నిస్తున్నారు.

-
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!











Click it and Unblock the Notifications