సీఎం జగన్ వద్దకు సుచరిత - పార్టీలో వారి పెత్తనం పైనే : రాజీనామా పైనా క్లారిటీ..!!
మాజీ హోం మంత్రి సుచరిత నిర్ణయం ఏంటి. ఏం చేయబోతున్నారు. ఏపీలో కేబినెట్ విస్తరణలో మొదలైన అసంతృప్తి నెమ్మదిగా తగ్గుతోంది. మంత్రి పదవి దక్కని సీనియరర్లు ఒక్కొక్కరుగా సీఎం జగన్ తో సమావేశమవుతున్నారు. వారికి సీఎం వారి భవిష్యత్ పైన భరోసా ఇస్తున్నారు. 2024 ఎన్నికల పైన వారికి బాధ్యతలు కేటాయిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అయితే , సీఎం వద్దకు వెళ్లే వారకు అలక బూనినట్లు కనిపించిన నేతుల..ఆ తరువాత బయటకు వచ్చి..అసలు తమకు ఎటువంటి అసంతృప్తి లేదని చెబుతున్నారు.

అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా..
ఇప్పటికే పార్టీ సీనియర్లు బాలినేని..పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి.. పార్ధసాధి..ఉదయభాను వంటి నేతలు సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత వారు పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే తయ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రివర్గ కూర్పు ఫైనల్ కాగానే.. తొలుత నిరసనలు మొదలైంది గుంటూరు జిల్లాలోనే.
అందులో మాజీ హోం మంత్రి సుచరిత అనుచరులు ఆందోళనకు దిగారు. గత కేబినెట్ లో పని చేసిన ఎస్సీలందరికీ తిరిగి మంత్రి పదవులు ఇచ్చి..తనకు ఇవ్వకపోవటం పైనా అసంతృప్తి - ఆవేదన వ్యక్తం చేసారు. బుజ్జగింపుల కోసం వచ్చిన రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు రాజీనామా లేఖ ఇచ్చినట్లు సుచరిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తరువాత కార్యకర్తలతోనూ సుచరిత తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించారు. తాను వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసానని.. పార్టీకి కాదని స్పష్టం చేసారు.

రాజీనామా లేఖ అందలేదంటూ
అయితే, స్పీకర్ తమ్మినేని తనకు సుచరిత రాజీనామా లేఖ అందలేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తనకు మంత్రి పదవి రాలేదని బాధ కంటే..పార్టీలో కొత్తగా వచ్చిన వారి పెత్తనం ఇబ్బందిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. తాము తొలి నుంచి వైఎస్సార్ ఫ్యామిలీకి విధేయుగా ఉన్నామంటూ గుర్తు చేసారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే..జగన్ కోసం పార్టీ వీడి..ఉప ఎన్నికల్లో పోటీ చేసామని చెప్పుకొచ్చారు.
ఇక, ఈ రోజు సుచరిత సీఎం జగన్ తో సమావేశం కానున్నట్లు విశ్వస నీయ సమాచారం. మంగళవారమే కలవాల్సి ఉన్నా..ఈ రోజు కలుస్తానంటూ సమాచారం ఇచ్చారు. దీని ద్వారా ఎస్సీ మంత్రులకు అందరికీ తిరిగి అవకాశం ఇచ్చినా..తనను మాత్రమే పక్కన పెట్టటం పైనే సుచరింత ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

సీఎం జగన్ తో భేటీ సమయంలో
తన అనుచరులతో ఇప్పటికే ఆందోళనలు వద్దని..ఎవరూ పార్టీకి రాజీనామాలు చేయవద్దని స్పష్టం చేసారు. ఇక, సీఎం జగన్ తో సమావేశం తరువాత సుచరిత ఇతర నేతల తరహాలోనే తన అసంతృప్తి గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రాజీనామా అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ వేళ.. కొంత అసంతృప్తులు సహజమని.. ఇవన్నీ ఒకటి రెండు రోజుల్లోనే సమిసిపోతాయని సీనియర్లు చెప్పుకొస్తున్నారు.
మిగిలిన నేతలు అందరూ ఇప్పటికే జగన్ కోసం తాము వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేసారు. అయితే, ఇతరుల కంటే ఒక అడుగు ముందుకేసి..రాజీనామా లేఖ ఇచ్చానని చెబుతున్న సుచరిత..సీఎంతో సమావేశం తరువాత ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications