టీడీపీలోకి మాజీ మంత్రి అవంతి - క్లారిటీ ఇచ్చేసారు..!!
మాజీ మంత్రి..ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు పార్టీ వైసీపీ వీడుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన టీడీపీలోకి తిరిగి వెళ్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే సీటు గురించి ప్రచారం మొదలైంది. ఇప్పుడు దీని పైన అవంతి శ్రీనివాస్ స్పందించారు. విశాఖ కేంద్రంగా అవంతి శ్రీనివాస్ కీలక నేతగా ఉన్నారు.
గతంలో టీడీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అక్కడి మాజీ నేతల పైన గురి పెట్టిందనే ప్రచారం సాగుతోంది. దీంతో అవంతి వ్యవహారం పైన చర్చ మొదలైంది.

అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత గంటాతో కలిసి 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అప్పుడు ఎమ్మెల్యే సీటు ఆశించినా ఎంపీ సీటు ఇవ్వటంతో అయిష్టంగానే పోటీ చేసారు. ఎంపీగా గెలిచారు. గంటా 2014లో చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. అవంతి ఎంపీగా ఢిల్లీకి పరిమితం కావాల్సి వచ్చింది.
అప్పటి వరకు ఐక్యంగా కనిపించిన గంటా - అవంతి మధ్య క్రమేణా గ్యాప్ పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో అవంతి వైసీపీలో చేరారు. భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి కేబినెట్ లో మంత్రి అయ్యారు.
మంత్రి అయిన సమయం నుంచి టీడీపీ - గంటా టార్గెట్ గా అవంతి విరుచుకుపడేవారు. కేబినెట్ విస్తరణ సమయంలో అవంతి మంత్రి పదవి కోల్పోయారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాధ్, బూడి ముత్యాల నాయుడు మంత్రులుగా కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ వీడుతారని ప్రచారం జరిగిన గంటా వైఖరిలో కొంత కాలంగా మార్పు వచ్చింది.
అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ను కలవటంతో పాటుగా పవన్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో, విశాఖకు చెందిన మాజీ టీడీపీ నేతలు తిరిగి పార్టీలోకి వస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
దీని పైన మాజీ మంత్రి అవంతి స్పష్టత ఇచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని అవంతి ఖండించారు.
ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని వ్యాఖ్యానించారు. జగన్మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications