ఓవర్ టేక్ ప్రయత్నంలో ఘోర ప్రమాదం: మాజీ మంత్రి కుమారుడి మృతి
అనంతపురం: అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మాజీ మంత్రి కుమారుడితో పాటు ఆయన బంధువు మరణించారు. మందు వెళ్తున్న వాహనాన్ని దాటేసే ప్రయత్నంలో కారు వేగం పెంచడంతో అది అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
మృతుల్లో ఒకతను మాజీ మంత్రి గుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి కాగా, మరొకతను ఆయన బంధువు రామకృష్ణా రెడ్డి. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం మరుగొడ్డువంక వద్ద శుక్రవారంనాడు జరిగింది.

అనంతపురం నుంచి తన స్వగ్రామం తాడిమర్రి మండలం దాడితోటకు స్కార్పియో వాహనంలో బయలుదేరిన సతీష్ రెడ్డి మరుగొడ్డువంక వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు.
ఆ ప్రయత్నంలో కారు అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications