తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్లో ఉరి వేసుకొని, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి మాజీ ఎమ్మెల్యే మోహన్ సతీమణి సుకేశన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది.

పోస్టుమార్టం నిమిత్తం సుకేశన మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించారు. సుకేశన తిరుపతిలోని తన సొంతింటిలోనే ఆమె ఉరేసుకుని తనువు చాలించారు.

అదనపు లడ్డూ టోకెన్ల జారీ కోటాను తగ్గించిన తితిదే

Ex MLA's wife commits suicide

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు లడ్డూ టోకెన్ల జారీ కోటాను తగ్గించింది. లడ్డూ టోకెన్ల కోటాను 25వేల నుంచి 15వేలకు తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో కొరతను అధిగమించేందుకు అదనపు లడ్డూ టోకెన్ల తగ్గింపు చేపట్టినట్లు తెలిపారు.

రైలు పట్టాలపై మృతదేహం

నెల్లూరులోని ఓ థియేటర్‌కు ఎదురుగా ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దుండగులు అతడి పీక కోసి రైలు పట్టాలపై పడేశారు. సంఘటనా స్థలాన్ని రైల్వే సీఐ పరిశీలించారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. వ్యక్తిని ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

English summary
The wife of former Tirupati MLA Mohan committed suicide early Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X