Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో ప్రారంభమైన బీజేపీ గేమ్..!? మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో స్టార్ట్.. ? నెక్స్ట్ ఎవరు ?

బీజేపీ ఏపీలో చేరికలకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చెయ్యాలని భావిస్తున్న బీజేపీ అందులో భాగంగా పావులు కదుపుతుంది. టీడీపీ నుండి, కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరే వారిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వలసలు స్టార్ట్ అయ్యాయి . అరకు మాజీ ఎంపీ, జనజాగృతి పార్టీ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత .. జనజాగృతి పార్టీ బీజేపీలో విలీనం

బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీత .. జనజాగృతి పార్టీ బీజేపీలో విలీనం

న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతే కాదు ఆమె గత ఏడాది ఆమె స్థాపించిన జనజాగృతి పార్టీని కూడా బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు కొత్తపల్లి గీత. అంతకుముందు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో ప్రత్యేకంగా భేటీ అయిన ఆమె ఇక తానుబీజేపీలో చేరే అంశం, పార్టీ విలీనంతోపాటు భవిష్యత్ లో తనకు న్యాయం చేయాలంటూ రామ్ మాధవ్ ను కోరినట్లు తెలుస్తోంది. అనంతరం రామ్ మాధవ్ నేతృత్వంలో అమిత్ షా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. కమలం గూటికి చేరారు.

Recommended Video

    కమలం గూటికి అరకు మాజీ ఎంపీ
    వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన ఎంపీ .. టికెట్ రాక సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన గీత

    వైసీపీ నుండి టీడీపీకి ఫిరాయించిన ఎంపీ .. టికెట్ రాక సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన గీత

    2014 ఎన్నికల్లో కొత్తపల్లి గీత జగన్ పార్టీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరకు లోక్ సభ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఫిరాయింపులలో భాగంగా కొత్తపల్లి గీత టీడీపీకి వైపు ఫిరాయించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ గీత తనకు టికెట్ రాదనీ తెలియటంతో ఆమె జనజాగృతి పార్టీని స్థాపించి పోటీ చేసి ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఇప్పుడు బీజేపీలో చేరారు .

     టీడీపీ టార్గెట్ గా బీజేపీ వ్యూహం .. చేరికలు స్టార్ట్ అయినట్టేనా ?

    టీడీపీ టార్గెట్ గా బీజేపీ వ్యూహం .. చేరికలు స్టార్ట్ అయినట్టేనా ?

    తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్య నాయకులను ప్రభావితం చెయ్యటానికి చాలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి చాలా మంది మాజీ ఎంపీలు , ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నారని ,అలాగే టీడీపీ నుండి కూడా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఆ ప్రయత్నంలో తొలి అడుగు కొత్తపల్లి గీత రూపంలో పడింది. ఆమె బీజేపీలో చేరింది. భవిష్యత్ లో ఇంకా చాలా మంది నేతలు బీజేపీలో చేరే అవకాశం వుంది. బీజేపీ టీడీపీ ప్లేస్ ను రీ ప్లేస్ చెయ్యాలనే ఆలోచనలో టీడీపీ టార్గెట్ గా ఏపీలో పావులు కదుపుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+