రాజధాని అమరావతి వద్ద అద్దిరిపోయే రైల్వే స్టేషన్- చర్లపల్లి తరహాలో.. !!
రాజధాని అమరావతి పరిధిలో విజయవాడ సమీపంలో ఉన్న రాయనపాడు రైల్వేస్టేషన్ కు మహర్దశ పట్టింది. సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అమృత్ భారత్ స్టేషన్లల్లో భాగంగా ఇది పునర్నిర్మితమౌతోంది. అత్యాధునిక వసతులు సమకూరుతున్నాయి. దీని పునర్నిర్మాణ పనులు దాదాపుగా 80 శాతం వరకు పూర్తి అయ్యాయి. వచ్చే ఏడాది ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
ప్రయాణికులకు ఆధునిక, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అమృత్ భారత్ కింద ఎంపిక చేసిన స్టేషన్లను డెవలప్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, ఆదోని, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప,ధర్మవరం, గుడివాడ, గుత్తి, గుంటూరు, హిందూపురం, కదిరి, కాకినాడ టౌన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, రాజంపేట, రేణిగుంట వంటివి ఉన్నాయి.

ఇందులో భాగంగా రాయనపాడు స్టేషన్ లో ప్లాట్ ఫామ్ ల నిర్మాణం, వెయిటింగ్ హాళ్లు, టికెట్లు కౌంటర్లు, ప్లాట్ ఫామ్ లపై షెడ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించిన వసతులతో సరికొత్తగా అందుబాటులోకి రానుంది. కొత్త ముఖద్వారం, విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, సౌకర్యవంతమైన వెయిటింగ్ హాల్, లిఫ్టులు, ఆధునిక టాయిలెట్లు, మెరుగుపరచిన ప్లాట్ఫారమ్ ఉపరితలం వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత మరిన్ని రైళ్లు ఆగేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా- విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడలో నిత్యం వందకు పైగా రైళ్లు ఆగుతుంటాయి. ప్రయాణికుల తాకిడి అధికం. దీనికి ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల మరికొన్ని రైళ్లకు ఇక్కడ హాల్ట్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుంది. నిజానికి- విశాఖపట్నం వైపు వెళ్లడానికి అటు వైపు నుంచి వచ్చే రైళ్లు విజయవాడకు రాకుండానే రాయనపాడు స్టేషన్ కు వచ్చేలా ట్రాక్ ఉంది. ఇక్కడ వసతులు లేకపోవడం వల్ల రైళ్లు ఆగట్లేదు.
విశాఖ-నాందేడ్, కాకినాడ పోర్ట్-లింగంపల్లి, నాందేడ్-సంబాల్పూర్, కాకినాడ టౌన్-లింగంపల్లి వంటి పరిమిత రైళ్లు ఇక్కడ ఆగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు ఇక్కడ హాల్ట్ కల్పించే అవకాశం ఉంది. విజయవాడకు ప్రత్యమ్నాయ టెర్మినల్ గా ఇది అందుబాటులోకి వస్తుంది. చర్లపల్లి తరహాలో దీన్ని డెవలప్ చేయాలని ప్రయాణికులు సైతం చాలాకాలం నుంచీ కోరుకుంటోన్నారు.
-
వార్ ఎఫెక్ట్ :నిలిచిన సిలిండర్ల సరఫరా- బుకింగ్, వినియోగం పై తాజా ఆంక్షలు..!! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..!












Click it and Unblock the Notifications