ఫ్యాన్స్ మేళా: బెజవాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా?
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయాలని ఆయన అభిమానులు విజ్ఞప్తి చేశారు. తాను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఆయన అభిమానులు ఆ డిమాండ్ను ముందుకు తెచ్చారు.
ప్రెస్క్లబ్బులో సమావేశమైన పవన్ కల్యాణ్ అబిమానులు విజయవాడలోని ప్రెస్ క్లుబ్బులో మధ్యాహ్న భోజనానికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ కోరుకు్ంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రావడం లేదని వారన్నారు.
ఆ విషయాలపై పవన్ కల్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పార్టీిని బలోపేతం చేసి పూర్తి స్థాయిలో జనసేనను తీర్చిదిద్దాలని వారు కోరారు. అభిమానుల కోరికను పవన్ కల్యాణ్ ఏ మేరకు తీరుస్తారనేది వేచి చూడాల్సిందే.

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఏ మేరకు అభ్యర్థులను నిలబెడుతారు, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాల్సే ఉంది. సొంతంగానే పోటీ చేస్తానని ఆయన ప్రకటించినప్పటికీ పార్టీ నిర్మాణమే లేనప్పుడు అంత సాహసం చేయగలరా అనేది కూడా చూడాల్సిందే.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపి, కాంగ్రెసు పార్టీలకు దీటుగా ఆయన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్మాణం ఎలా జరుగుతుందనేది ఇంకా తేలడం లేదు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications