పల్నాడులో ఘోర ప్రమాదం: నలుగురు మహిళలు మృతి
పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలవ కట్టపై ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందారు. పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు.
ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరప కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళలు మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా కూలీల మృతి బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశించారు.
అనకాపల్లిలో విషాదం
అనకాపల్లి జిల్లా తుమ్మలపాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళా హోంగార్డు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అట్టా ఝాన్సీ.. తన ఆరేళ్ల కుమారుడు దినేశ్ కార్తీక్తో కలిసి ఏలూరు కాలువలో దూకారు. భర్త అచ్యుతరావు అలియాస్ విజయ్ వేధింపులు భరించలేక ఆమె తన కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
ఇది ఇలావుండగా, అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. కొత్తపేట గ్రామానికి చెందని పవన్ తేజ, సూర్య తేజలుగా వారిని గుర్తించారు. సూర్యతేజ మృతదేహం లభ్యం కాగా, పవన్ తేజ కోసం గాలిస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications