ఏపిలో వాలెంటైన్స్ డే కీలక పొలిటికల్ ఘట్టం మిస్ : అసలు కారణం ఇదేనా..!
ఏపి లో ఫిబ్రవరి 14న...ఈ రోజున జరగాల్సిన రెండు కీలక ఘట్టాలు వాయిదా పడ్డాయి. విపక్ష నేత జగన్ తన సొంతింటి గృహ ప్రవేశం ఇదే రోజన చేసి ఇక, ఇక్కడి నుండి ఎన్నికల సమరశంఖం పూరించాలని భావించారు. అది వాయిదా ప డింది. ఇదే గృహప్రవేశానికి తెలంగాణ ముఖ్యంత్రి కెసిఆర్ ను ఆహ్వానించారు. విశాఖలోనూ కేసీఆర్ పర్యటన ఖరారు అయింది. అయితే, రెండు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కారణం ఏంటనే చర్చ మొదలైంది.
జగన్ గృహ ప్రవేశం వాయిదా..
ఏపి రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఈ రోజున జగన్ గృహప్రేవేశ ముహూర్తం ఖరారైంది. ఒకే ప్రాంగణం లో సొంతింటి తో పాటుగా పార్టీ ఏపి కార్యాలయం సైతం నిర్మాణం పూర్తి చేసారు. ఈ గృహ ప్రవేశానికి పార్టీ నేతలతో పా టుగా.. ఫెడరల్ ఫ్రంట్ కోసం తాను వచ్చి కలుస్తానంటూ ఆఫర్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జగన్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు విశాఖలో మరో కార్యక్రమానికి సైతం కేసీఆర్ రావాల్సి ఉండటంతో తాడేపల్లి వస్తారని అందరూ భావించారు.

అయితే, జగన్ తన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. సోదరి షర్మిల జ్వరంతో ఉండటంతో ఈ కార్యక్రమం వాయిదా వేసుకున్నట్లు వైసిపి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, దీని వెనుక అసలు కారణం ఏదో ఉందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్ పర్యటన రద్దు..
ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖపట్నం పర్యటన రద్దయింది. బడ్జెట్ రూపకల్పన, మంత్రివర్గ విస్తరణ సన్నాహాల దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరు కావాలని నిర్వాహకు లు ఆయనను ఆహ్వానించగా మొదట్లో అంగీకరించారు. ఈ నెల 17 నుంచి కేంద్ర ఆర్థిక సంఘం పర్యటించనుంది. సీఎంతో, అధికారులతో భేటీ, క్షేత్రస్థాయి పర్యటనలు జరగనున్నాయి.

కీలకమైన ఈ పర్యటనను పురస్కరించుకొని సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీ తోపాటు రాష్ట్ర బడ్జెట్ను రూపొందించే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. సీఎం విశాఖ పర్యటనను రద్దు చేసుకోవడం మంత్రివర్గ విస్తరణ వాదనకు బలం చేకూరుస్తుంది. ఆయన తరఫున ప్రశాంత్రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు. ఇలా..కారణాలు ఏవైనా..14న ఏపిలో ఒక ఆసక్తి కర రాజకీయ ఘట్టం ఆవిష్కృతమవుతుందని భావించిన వారికి నిరాశ మిగిలింది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications