చంద్రబాబు పై సీఐడీ కేసు క్లోజ్- ఫిర్యాదు దారుడే క్లీన్ చిట్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదైన కేసు క్లోజ్ అయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ జగన్ హయాంలో చంద్రబాబు పైన సీఐడీ కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ నిర్దారించింది. దీంతో, చంద్రబాబుతో సహా సహా మరో 15 మందికి ఊరట లభించింది. అప్పట్లో ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో,కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం జరిగింది.
వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్నెట్ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత... 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరునూ చేర్చారు. అయితే.. భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్లుగా సీఐడీ నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సీఐడీ ధ్రువీకరించింది.

దీనికి సంబంధించి తాజాగా నివేదిక సమర్పించింది. ఫైబర్నెట్లో అక్రమాలేవీ చోటు చేసుకోలేద ని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదికలో తేల్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ మధు సూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. కేసును మూసేస్తున్నట్లు రాత పూర్వకంగా తెలియచేయటంతో పాటుగా మౌఖికంగానూ స్పష్టం చేసారు. దీంతో.. ఈ కేసు నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసినట్లు స్పష్టం అవుతోందని కూటమి నేతలు చెబుతున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications