చంద్రబాబు పై సీఐడీ కేసు క్లోజ్- ఫిర్యాదు దారుడే క్లీన్ చిట్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదైన కేసు క్లోజ్ అయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ జగన్ హయాంలో చంద్రబాబు పైన సీఐడీ కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ నిర్దారించింది. దీంతో, చంద్రబాబుతో సహా సహా మరో 15 మందికి ఊరట లభించింది. అప్పట్లో ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో,కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం జరిగింది.
వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్నెట్ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత... 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరునూ చేర్చారు. అయితే.. భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్లుగా సీఐడీ నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సీఐడీ ధ్రువీకరించింది.

దీనికి సంబంధించి తాజాగా నివేదిక సమర్పించింది. ఫైబర్నెట్లో అక్రమాలేవీ చోటు చేసుకోలేద ని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదికలో తేల్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్నెట్ పూర్వ మేనేజింగ్ డైరెక్టర్ మధు సూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.
ఇప్పుడు కేసును క్లోజ్ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. కేసును మూసేస్తున్నట్లు రాత పూర్వకంగా తెలియచేయటంతో పాటుగా మౌఖికంగానూ స్పష్టం చేసారు. దీంతో.. ఈ కేసు నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసినట్లు స్పష్టం అవుతోందని కూటమి నేతలు చెబుతున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications