ఈ ఏడాది చివరకు 'గరుడ వారధి'
శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దీనిలో భాగంగా తిరుమలలో ఉన్న అన్ని ఉద్యానవనాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల మనసంతా స్వామివారి కృపతో నింపాలనే ఉద్దేశంతో రూ.60 లక్షలతో అభివృద్ధి పనులు చేయబోతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తితిదే అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈనెల 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు. తిరుమలలో అందుబాటులోకి తీసుకొచ్చిన నూతన పరకామణి భవనాన్ని కూడా జగన్ ప్రారంభించబోతున్నట్లు సుబ్బారెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుపతిలో శ్రీనివాస సేతు(గరుడ వారధి) నిర్మాణ పనులు ఈ సంవత్సరం చివరికి పూర్తి చేస్తామని, 2023 లో వారధి అందుబాటులోకి వస్తుందన్నారు. శ్రీనివాస సేతుతో తిరుపతి వాసులకు, భక్తులకు ట్రాఫిక్ సమస్యలు నివారించినట్లవుతుందన్నారు. అంతేకాకుండా పూర్తి ప్లాస్టిక్ రహిత తిరుమలగా రూపొందించాలనుకుంటున్నామని, ఎక్కడా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా చూస్తామన్నారు.
-
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications