అమరావతికి ఆర్ధిక శోభ.. 25 బ్యాంకులు, శంకుస్థాపనకు నిర్మలా సీతారామన్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి సారించింది. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కేంద్ర సహకారాన్ని కూడా తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారీ నిధులను సమకూర్చుకుంటూ రాజధాని అమరావతిలో మళ్ళీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడానికి కీలక సంస్కరణలను అమలు చేస్తోంది.
అమరావతిలో బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఒకేసారి 12బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఇక ఈ కార్యక్రమానికి ఈనెల 28న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ రానున్నట్టు సమాచారం. ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించింది. గత నెలలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

ఆర్బీఐ తో పాటు మొత్తం 25 బ్యాంకుల ఏర్పాటు
అయితే 12 బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సీతారామన్ ప్రత్యక్షంగా వచ్చి చేస్తారా లేకా, వర్చువల్ గా పాల్గొంటారా అనేది ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మొత్తం 25 జాతీయ, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు అమరావతిలో శంకుస్థాపన జరగనుంది.
వైసీపీ హయాంలో ఆగిన పనులు
ఈ బ్యాంకు భవనాల కోసం స్థలం కేటాయించారు. చాలా బ్యాంకులు తమ స్థలాలను ఇప్పటికే సిద్ధం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణాలకు 2014-2019 మధ్యలోనే స్థలాలు కేటాయించినప్పటికీ అప్పుడు పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వ హయాంలో వీటి కోసం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.
అమరావతిని ఆర్థిక కేంద్రంగా మార్చే ప్లాన్ లో ఏపీ సర్కార్
ఇక ప్రస్తుతం బ్యాంకులకు ఒకేసారి అమరావతిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదికగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మొత్తం అన్ని బ్యాంకుల భవనాలకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏపీ రాజధాని అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో, ఇప్పటికే వివిధ బ్యాంకులకు కావలసిన, వారిని బ్యాంకులు ఏర్పాటు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది.
పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ప్లాన్
ఈ శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన వెంటనే నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తారు. ఈ బ్యాంకుల ప్రాజెక్టు అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతిలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనేక నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇక శంకుస్థాపన జరిగితే బ్యాంకుల నిర్మాణ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగనున్నాయి.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్











Click it and Unblock the Notifications