వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో లారీ దగ్థం
విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ దగ్థమైంది. జాతీయ రహాదారిపై రద్దీ సమయంలో ప్రమాదం జరగటంతో ప్రజలు ఆందోళన చెందారు. జాతీయ రహదారిపై తాటిచెట్లపాలెం నుంచి అక్కయ్యపాలెం వైపు లారీ వస్తోంది. ఆ సమయంలో సర్వీసు రోడ్డు నుంచి ఓ వ్యక్తి బైక్ పై వచ్చాడు. దీంతో సిగ్నల్ దాటిన లారీ వేగంగా బైక్ ను ఢీ కొట్టింది. డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గాయాలతో బయటకు పడగా బైక్ మాత్రం లారీ కింద చిక్కుకుంది. లారీ కొంత దూరం బైక్ను ఈడ్చుకుంటూ రావడం.. ఆ రాపిడికి మంటలు చేలరేగటం క్షణాల్లో జరిగింది. వెంటనే మంటలు లారీకి వ్యాపించింది. అందరూ చూస్తుండగా లారీ మొత్తం దగ్థమైంది.
Comments
English summary
A lorry burnt in Visakhapatnam highway.
Story first published: Saturday, November 19, 2016, 17:40 [IST]