మనసులోమాట: పురంధేశ్వరి టిడిపిలోకి వెళ్తే బావుండు

 Followers on Purandeswari's decision
విశాఖపట్నం: మాజీ కేంద్రమంత్రి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరాలని తాము కోరుకుంటున్నామని అయితే, ఇప్పటికే ఆమె బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోందని, అయినా ఆమె వెంట తాము నడుస్తామని ఆమె వర్గం చెబుతోంది.

దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం ఉదయం విశాఖపట్నంలో కార్యకర్తలు, అనుచరులతో భేటీ అయ్యారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు తమ మనసులోని మాట చెప్పారు. పురంధేశ్వరి బిజెపిలోకి వెళ్లడం కన్నా టిడిపిలోకి వెళ్లాలని తాము కోరుకుంటున్నామన్నారు.

టిడిపి నుండే విశాఖ ఎంపీగా పోటీ చేయాలంటున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి వెళ్తే బాగుంటుందని తాము భావిస్తున్నామంటున్నారు. అయితే, ఆమె ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున తామ ఆమె వెంటే నడుస్తామని చెబుతున్నారు.

కాగా, పురంధేశ్వరి బిజెపిలో చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు కార్యకర్తలతో భేటీ అవుతున్న ఆమె.. ఒకటి రెండు రోజుల్లో భారతీయ జనతా పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఆమె విశాఖ లేదా విజయవాడ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+