టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు: ప్రశంసించిన సుజయ
విజయనగరం/అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆదివారం టీడీపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరారు. మాజీలు గోమాంగో, జయమణిలు చేరారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడం తనకు కొత్త కాదని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో కలిసి పదేళ్లు పని చేశానని అన్నారు. తన నియోజకవర్గం కాకపోయినా బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించానని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. కిడారి, సివేరి హత్యలు దురదృష్టకరమని చెప్పారు. బాక్సైట్ తవ్వకాల వెనుకున్న నిజాలు ప్రజలకు తెలియాలని చెప్పారు.

సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కిషోర్ చంద్రదేవ్కు, జగన్కు పోలికనే లేదని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలను ప్రయివేటుపరం చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి వచ్చే వ్యక్తిపై విచారణ లేదని విమర్శించారు. దేశంలోని అవినీతిపరులను కేంద్రం కాపాడుతోందన్నారు. కిశోర్ చంద్రదేవ్ ఆజాత శత్రువు అని మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. కిశోర్ సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications