జగన్ పై రేణుకాచౌదరి వ్యాఖ్యలు-కమ్మోళ్లను హేళన చేస్తున్నారు-కమ్మరావతి పేరు పెట్టగలరా ?
ఏపీలో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇక్కడి కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉండనే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతల్లోనూ దీనిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తాజాగా బయటపడింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కమ్మ సామాజికవర్గ సమ్మేళనంలో అమరావతి, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
నిజమాబాద్ లో నిర్వహించి కమ్మ సమ్మేళనంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకాచౌదరి సహా పలువురు కుల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రేణుక సహా పలువురు నేతలు తప్పుబట్టారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన రేణుకా చౌదరి.. అమరావతి కేంద్రంగా ఈ ప్రయత్నాలు జరగడంపై మండిపడ్డారు.

అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తున్న ఏపీ సీఎం జగన్.. చేతనైతే రాజధానికి కమ్మరావతిగా పేరు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నారు. అమరావతి కమ్మ రాజధానిగా పేర్కొంటూ జగన్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని రేణుక తీవ్రంగా తప్పుబట్టారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడకండని సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.
Recommended Video

ఏపీలో వైసీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను, టీడీపీని వైసీపీ సర్కార్ టార్గెట్ చేయడంపై ఆయా నేతలు మండిపడుతున్నారు. ముఖ్యంగా అమరావతిని కమ్మరావతిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరి వంటి కమ్మ సామాజిక వర్గ నేతలకు ఇతర నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రేణుక ఇవాళ సీఎం జగన్ ను నేరుగా సవాల్ చేశారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య..












Click it and Unblock the Notifications