హామీలను బాండ్ పేపర్ మీద రాసి మ్యానిఫెస్టో విడుదల చేసిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విశాఖలో హోరాహోరీగా పోరు జరుగుతుంది. విశాఖపట్టణం లోక్ సభ స్థానం నుండి ఎన్నికల బరిలో ఉన్న జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను నామినేషన్ వేసిన రోజున చేసిన ప్రకటనకు కట్టుబడి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి ప్రకటించిన మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
జనసేన విశాఖ లోక్ సభ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖపట్టణం మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద రాసిస్తానని ప్రకటించారు.అన్న మాట ప్రకారం మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏప్రిల్ 06వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్నికల మేనిఫెస్టో బాండ్ పేపర్ మీద రాసి జేడీ రిలీజ్ చేశారు. రూ. 100 బాండ్ పేపర్పై హామీలను పొందుపరచిన ఆయన హామీలు నెరవేర్చకుంటే లీగల్ గా చర్య తీసుకోవచ్చని చెప్పి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు .

బాండ్ పేపర్లో హామీలతో పాటు తన విజన్ కూడా ప్రకటించిన మాజీ జేడీ
ఇక ఆయన విశాఖ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నాడు కాబట్టి విశాఖలోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఒక ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తానని తాను రాసిచ్చిన బాండ్ పేపర్ లో పొందు పరిచారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్ వేదికగా తనవంతు కృషి చేస్తానని, విశాఖ సమగ్రాభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు.ప్రతి మూడు నెలలకు ఇచ్చిన హామీలను..సమస్యల పరిష్కారానికి చేసిన పురోగతిపై నివేదిక.. 'రీచ్ యువర్ ఎంపీ' పేరిట యాప్ని రిలీజ్ చేసి ప్రజల ముందుంచుతానని తెలిపారు. ఒక ఆదర్శ ఎంపీగా, మీ వాడిగా , మీ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలిపారు.

విశాఖ సమస్యలు తీర్చకుంటే బాండ్ ఆధారంగా లీగల్ గా చర్యలు తీసుకోండి అంటున్న లక్ష్మీ నారాయణ
విశాఖలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన జేడీ..మరికొన్ని హామీలను అందులో పొందుపరిచారు. వైజాగ్ వాసుల అతిపెద్ద సమస్య తాగునీరు .ప్రజలకు సురక్షిత తాగునీటి సరఫరా కోసం ఇంటిగ్రేటెడ్ వాటర్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన లక్ష్మీ నారాయణ కాలుష్య నియంత్రణ కోసం 5 ఏళ్లలో విద్యార్థుల భాగస్వామ్యంతో రెండు కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుంటానని నియోజకవర్గ అభివృద్ధికి తన విజన్ ఏంటో అది అంతా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయ్యకపోతే కోర్టుకు కూడా లాగొచ్చని జేడీ తెలిపారు. మరి హామీలన్నీ బాండ్ మీద రాసి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న మాజీ జేడీ లక్ష్మి నారాయణను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి .
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications