అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
అమరావతి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదివారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా కనుమూరు సమీపంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
నాలుగు రోజుల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడ బిజెపికి గుడ్బై చెప్పారు.అనుచరులతో కలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వనించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాణ్యం నియోజకవర్గం అభివృద్ది చెందిందని ఆయన గుర్తు చేశారు.వైఎస్ తనయుడు జగన్తో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన విమర్శలు గుప్పించారు.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో తాను పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. పాణ్యం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గౌరు చరితా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే పాణ్యం నుండి తనకే టిక్కెట్టు ఇస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారని గౌరు చరితారెడ్డి ఇటీవలనే ప్రకటించారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications