అనుచరులతో కలిసి వైసీపీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
అమరావతి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదివారం నాడు వైసీపీలో చేరారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో యాత్ర సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా కనుమూరు సమీపంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
నాలుగు రోజుల క్రితం కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా చేశారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడ బిజెపికి గుడ్బై చెప్పారు.అనుచరులతో కలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డికి వైసీపీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వనించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పాణ్యం నియోజకవర్గం అభివృద్ది చెందిందని ఆయన గుర్తు చేశారు.వైఎస్ తనయుడు జగన్తో కలిసి పనిచేయడం తన అదృష్టమన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్కార్ వైఫల్యం చెందిందని ఆయన విమర్శలు గుప్పించారు.
మరో వైపు వచ్చే ఎన్నికల్లో తాను పాణ్యం నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. పాణ్యం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన గౌరు చరితా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే పాణ్యం నుండి తనకే టిక్కెట్టు ఇస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారని గౌరు చరితారెడ్డి ఇటీవలనే ప్రకటించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications