చంద్రబాబు ఇస్తేనే జగన్ ? టీడీపీకి జరిగేదిదే..! ఈసారి పోటీ చేయట్లేదు-రాయపాటి కామెంట్స్..
గుంటూరు : ఏపీలో సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరైన గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తాజా రాజకీయాలపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పోటీతో మొదలుపెట్టి, టీడీపీ-జనసేన పొత్తు, వచ్చే ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తనకు బదులు కుమారుడికి టికెట్ అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు సీటు ఎక్కడ ఇస్తే అక్కడ తన కుమారుడు రాయపాటి శ్రీనివాస్ పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే గుంటూరు జిల్లాలోని తాడికొండ సీటు తోకల రాజవర్దన్ రావుకేనని రాయపాటి వ్యాఖ్యానించారు. ఆయన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారని కూడా జోస్యం చెప్పారు.

మరోవైపు టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటే మంచిదేనని రాయపాటి తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం మంచిది కాదని జగన్ సర్కార్ కు ఆయన హితవు పలికారు. ఆనాడు చంద్రబాబు అనుమతి ఇస్తేనే కదా జగన్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. అలాగే లోకేష్ పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వాలని రాయపాటి ఏపీ ప్రభుత్వానికి సూచించారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications