2029లోనూ ఏపీలో ఎవరు గెలవచ్చు ? తేల్చేసిన ఉండవల్లి..!
ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ ప్రస్తుతం అధికారంలో ఉంది. రెండేళ్ల పాలన తర్వాత కూటమి పాలనపై రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మరోవైపు విపక్ష వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా అమరావతి రాజధానితో పాటు పలు కీలక అంశాల్లో ప్రభుత్వంతో విభేదిస్తున్న వైసీపీకి తిరిగి ఏపీలో ఛాన్స్ ఉంటుందా లేదా అన్న చర్చపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) స్పందించారు.
ఏపీలో ప్రస్తుతం నెలకున్న పరిస్ధితుల ఆధారంగా చూస్తే.. విపక్ష వైసీపీకి 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అంత సులువు కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. కూటమి పార్టీలు కలసి ఉంటే పోటీ చాలా కఠినమని, విడిపోతే మాత్రం వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని ఉండవల్లి తెలిపారు. అలాగే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని ఉండవల్లి తెలిపారు. దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందించకపోవడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ లో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల కూటమికే గత ఎన్నికల్లో జనం ఓటేశారు. అలాగే మరోసారి కూడా వీరు కూటమిలో భాగస్వాములుగా ఉంటూ జనం వద్దకు వెళ్తే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అలా కాకుండా వీరు వీడిపోతే మాత్రం కష్టమని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ మధ్యే తన అంచనా సైతం వెల్లడించారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. కూటమి పార్టీలు విడిపోతే తప్ప జగన్ కు అవకాశం కష్టమేనని ఆయన తేల్చిచెప్పేస్తున్నారు.
-
సాయిరెడ్డి తాజా సంకేతాలు, తెర వెనుక..!? -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!














Click it and Unblock the Notifications