ఔటర్‌లో ప్రమాదం, లారీని ఢీకొన్న డిసిఎం: 4గురి మృతి

 Four die in accident on ORR
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారులోని వట్టినాగులపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డు పైన మంగళవారం ఉధయం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డిసిఎం వ్యాను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. పలువురిగి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో హబూబాఖాన్, మూలానబి, సమ్రీన్, దస్తగిరిలు మృతి చెందారు. రాజేంద్ర నగర్‌కు చెందిన పద్దెనిమిది మంది కర్నాటకలోని బీదర్‌లో జరిగిన ఓ వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బీదర్ నుండి బయల్దేరిన డిసిఎం వ్యాను మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వట్టినాగులపల్లి వద్దకు రాగానే ఔటర్ రింగు రోడ్డు పైన ఆగి ఉన్న లారీనీ ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

వ్యక్తి హత్య

మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి మర్మాంగాలు కోసి దారుణంగా హింసించి హతమార్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+