వందే భారత్ ల నుంచి అమృత్ స్టేషన్ల వరకూ-ఈ ఏడాది రైల్వే ఘనతలివే..!
ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే అద్భుత విజయాలు నమోదు చేసుకుంది. ఇందులో వందే భారత్ రైళ్ల పొడిగింపులతో పాటు టెర్మినళ్ల అభివృద్ధి, అమృత్ భారత్ స్టేషన్ల అప్ గ్రడేషన్లు, నెట్ వర్క్ విస్తరణలు, ప్రత్యేక రైళ్లు నడపటం, కార్గో ఆదాయం పెంచుకోవడం ఇలా పలు అంశాల్లో దక్షిణ మధ్య రైల్వే మేటిగా నిలిచింది. తద్వారా దేశంలోని ఇతర జోన్లతో పోలిస్తే పలు అంశాల్లో మెరుగ్గా నిలిచింది.
ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధిని సాధించింది. మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రయాణికుల సౌకర్యాలు, కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం, స్టేషన్ల అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, రవాణా సామర్థ్యం పెంపు, ఆదాయం వృద్ధి, భద్రతా చర్యల్లో కొత్త శిఖరాలకు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో రైల్వే రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి ఉప టెర్మినల్ను ప్రారంభించింది. అలాగే తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వారాంగల్ స్టేషన్లు ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన అమృత్ స్టేషన్లను మే నెలలో ప్రారంభించింది. వీటితో పాటు కాచిగూడ హెరిటేజ్ స్టేషన్ను రూ.2.2 కోట్లతో అభివృద్ది చేసింది.

కాచిగూడ-భగత్ కి కోటి రైలు కొత్త రైలును జూలైలో, .తిరుపతి-షిర్డీ రైలు డిసెంబర్ లో ప్రారంభించింది. అలాగే పలు వందే భారత్ లను పొడిగించింది. ఇందులో ముంబై సీఎస్ఎంటీ-జల్నా-నాందేడ్ ఆగస్టులో, చెన్నై-విజయవాడ-నరసాపురం డిసెంబర్ లో పొడిగించారు. అలాగే 2024తో పోలిస్తే.. దక్షిణ మధ్య రైల్వే ఆదాయం పెంచుకుంది. సరకు రవాణాలో 136.2 మిలియన్ టన్నులకు చేరింది. సరకు ఆదాయంలో ₹12,841కోట్లకు చేరింది.ప్రయాణికుల ఆదాయం ₹5,525 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం₹19,314 కోట్లకు చేరింది. ఈ ఏడాది 199 కిలోమీటర్ల ట్రాక్ విస్తరించారు.

ఈ ఏడాది 184 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పూర్తి చేశారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్ 100 శాతం విద్యుదీకరణ చేశారు. 529 కి.మీ విస్తీర్ణంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బ్లాక్ సిస్టమ్లు 9 సెక్షన్లలో అమల చేస్తున్నారు. 68 లెవెల్ క్రాసింగ్ లు రద్దు చేయడంతో పాటు 22 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, 60 రోడ్ అండర్ బ్రిడ్జ్లు నిర్మాణ చేపట్టారు. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 52 స్టేషన్లు/భవనాలు జీరో ప్లస్ ఎనర్జీ లేబెలింగ్ గుర్తింపు సాధించాయి.గుంతకల్ డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తమ యూనిట్ అవార్డు అందుకుంది. అలాగే రాయచూర్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ సాధించాయి.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications