చంద్రబాబు కోసం భవిష్యత్ తరం: ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన నారా బ్రాహ్మణి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వేడిని తలపిస్తున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని ఏపీ వ్యాప్తంగా టిడిపి శ్రేణులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బయటకు వచ్చేవరకు పోరాటం చేస్తామని చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కొందరు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ఇక తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చంద్రబాబుకు మద్దతు తెలపడం లో భాగంగా ఓ బాలుడు నారా బ్రాహ్మణి వద్దకు వచ్చాడు.

చంద్రబాబు లోకేష్ లకు మద్దతు తెలపడం కోసం దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన ఆ బాలుడు నారా బ్రాహ్మణి తో మాట్లాడాడు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు తాను పోరాటం చేస్తానని ఆ పిల్లవాడు బ్రాహ్మణి తో చెప్పాడు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర ద్వారా ప్రజల కోసం పోరాటం చేశాడని ఆ బాలుడు బ్రాహ్మణి తో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
Anith Kumar travelled all the way to bring me a smile & to support @ncbn garu & @naralokesh. His parents married through the “Chandranna Pelli Kanuka” scheme. #IAmWithCBN to protect future generations of AP. pic.twitter.com/m0iqn3pGPY
— Brahmani Nara (@brahmaninara) September 15, 2023
నారా బ్రాహ్మణి ఆ చిన్నారి బాలుడు మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ చిన్నారి బాలుడు పేరు అనిత్ కుమార్ అని తనకు చిరునవ్వు తీసుకురావడానికి, నారా చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కు మద్దతు ఇవ్వడానికి ఆ బాలుడు వచ్చాడని బ్రాహ్మణి పేర్కొన్నారు.
చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఆ చిన్నారి తల్లిదండ్రులు వివాహం చేసుకుని ఒకటయ్యారు అని పేర్కొన్న నారా బ్రాహ్మణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాలను రక్షించడానికి తాను కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నానంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు కోసం చిన్నపిల్లలు కూడా పోరాటం చేస్తామని అంటున్నారని ఈ వీడియోను టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications