మైనింగ్ రారాజు గాలి కుమార్తె పెళ్లికి కడప కింగ్ డుమ్మా !
కడప/బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభలోని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ డుమ్మా కొట్టారు. ఆయన ఈ శుభకార్యానికి హాజరు కాలేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలోని 36 ఎకరాల్లోని ప్రాంగణంలో గాలి జనార్దన్ రెడ్డితన కుమార్తె బ్రహ్మిణి వివాహం రంగరంగ వైభంగా నిర్వహిస్తున్నారు. తనకు చిరకాల మిత్రుడు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తో పాటు ఆపార్టీ నాయకులను తన కుమార్తె పెళ్లికి గాలి జనార్దన్ రెడ్డి ఆహ్వానించారు.

జగన్ గాలి ఇంట జరిగే పెళ్లికి హాజరౌతారని జోరుగా ప్రచారం జరిగింది. బెంగళూరులో ఉంటున్న వైఎస్ఆర్ అభిమానులు గాలి ఇంట జరిగే పెళ్లికి వెళ్లి జగన్ ను కలుసుకోవాలని మంగళవారం రాత్రి బెంగళూరు ప్యాలెస్ మైదానంలోకి వెళ్లారు. అయితే జగన్ రాలేదని తెలుసుకుని వెనుతిరిగారు.
జగన్ ఎందుకు పెళ్లికి రాలేదు అనే విషయంపై మాట్లాడటానికి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు నిరాకరించారు. మొత్తం మీద జగన్ పెళ్లికి వస్తారని ఎదురు చూసిన గాలి, ఆయన అభిమానులు చివరి నిమిషయంలో షాక్ కు గురైనారు. జగన్ ఎందుకు పెళ్లికి రాలేదు ? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications