కాలి నడకన తిరుమలకు కుటుంబంతో గాలి
తిరుపతి: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసు నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శనివారం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన గాలి కాలినడకన కొండమీదకు వచ్చారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డికి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు తీర్ధ ప్రసాదాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా శనివారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ హీరో కళ్యాణ్ రామ్ కూడా తిరుమలకు వచ్చారు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూ. ఎన్టీఆర్తో కలిసి సినిమా చేస్తామని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.
శనివారం పటాస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన కళ్యాణ్ రామ్ విఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి కథ దొరికితే బాలయ్య, జూ. ఎన్టీఆర్లతో కలిసి నిటిస్తానన్నారు. పటాస్ తరువాత ‘షేర్' అనే సినిమాలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వివిధ కేసుల్లో నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఇటీవల ఓ కేసులో ఆయన హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications