ఎపిలో కెసిఆర్ అంతటి అందగాడు లేడా, సాక్షి పత్రికది తప్పు: గాలి
తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి దిగవనున్న ఆంధ్రప్రదేశ్.
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఎంపి కవిత అనడం అప్రజాస్వామికమని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏపీ ప్రజలు కేసీఆర్ను కోరుకుంటున్నట్టు తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ చెబుతున్నారని ఆయన గుర్తు చేస్తూ కేసీఆర్ అంతటి అందగాడు మా ఏపీలో లేరా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తెలంగాణ పట్ల స్నేహపూర్వకంగా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణిలో ఉందని ముద్దుకృష్ణమ విమర్శించారు.
దెబ్బకు దెబ్బ పేరుతో సాక్షి దినపత్రిక తప్పుడు వార్త ప్రచురించిందని, పురుషోత్తంపట్నం పోలవరానికి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ ఆమోదయోగ్యమని కేంద్రమే చెప్పిందని అన్నారు. అపెక్స్, సీడబ్ల్యూసి అనుమతి లేకుండా కాళేశ్వరానికి టెండర్లు పిలిచారని మరోసారి ప్రశ్నించారు. మహారాష్ట్రతో కలిసి తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించాలని యోచిస్తోందని, ఇలా చేస్తే ఏపీ నష్టపోతుందని గాలి ముద్దుకృష్ణమ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గోదావరిపై ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించి దిగవనున్న ఆంధ్రప్రదేశ్కు నీరు రాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించే హక్కు టీఆర్ఎస్కు లేదని గాలి అన్నారు. కేవలం శాసనసభ నుంచి వాకౌట్ చేసినందుకు టీడీపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వాకౌట్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుందన్నారు. టీడీపీ సభ్యులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్చేశారు.

బీజేపీపై నారాయణ ఫైర్
ఉత్తరప్రదేశ్లో విజయం తర్వాత కేంద్ర ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. యూపీలో ప్రజలను ఏమార్చి విజయం సాధించారని గుంటూరులో ఆరోపించారు.
బీజేపీ వ్యవహారశైలి ఆందోళన కలిగిస్తోందని.. దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ప్రతిపక్షాలను చూసి భయపడుతున్నాయని.. అప్రజాస్వామ పద్ధతిలో ఎమ్మెల్యేలను సభకు రానీయకుండా చేస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై నిషేధం కొనసాగించడం సరికాదన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications