వియ్యంకులు కాబోతున్న మంత్రులు గంటా, నారాయణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, నారాయణలు వియ్యంకులు కాబోతున్నారు. గంటా శ్రీనివాస రావు కుమారుడికి, నారాయణ రెండో కుమార్తెతో వివాహం జరిపించేందుకు ఇరువురు మంత్రుల కుటుంబాలు అంగీకరించాయి.
దీంతో ఇప్పటిదాకా సహచర మంత్రులుగా ఉన్న శ్రీనివాస రావు, నారాయణలు వియ్యంకులుగా మారనున్నారు. గంటా కొడుకు రవితేజ, నారాయణ కూతురు శరిణిల మధ్య వివాహానికి సంబంధించి శనివారం నెల్లూరులోని నారాయణ స్వగృహంలో జరిగిన సంప్రదింపుల్లో అవగాహన కుదిరింది.
కొడుకు, కూతురు ఉన్న గంటా గతేడాది కూతురు పెళ్లి చేశారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్న నారాయణ పెద్ద కుమార్తెకు ఇటీవలే పెళ్లి చేశారు. తాజాగా రెండో కుమార్తెకు కూడా ఆయన వివాహం చేయాలుకుంటున్నారు. సింగపూర్లో బీబీఎం పూర్తి చేసిన రవితేజ, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించారు. ఇక శరిణి లండన్లో ఎంబీఏ పూర్తి చేశారు. వీరికి త్వరలో నిశ్చితార్థం జరగనుంది.