పవన్ కల్యాణ్ తో గంటా శ్రీనివాసరావు భేటీ - వ్యూహం సిద్దం..!!?
విశాఖ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే.. విశాఖ కీలక నేత గంటా శ్రీనివాస రావు జనసేనానితో భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలో ప్రధానితో సమావేశం అయ్యేందుకు విశాఖ వచ్చిన జనసేనాని స్థానికంగా నోవాటెల్ హోటల్ లో బస చేసారు. అక్కడే అదే హోటల్ లో కొందరు బీజేపీ ముఖ్య నేతలు దిగారు. ప్రధాని పర్యటన..పవన్ కల్యాణ్ టూర్ నేపథ్యంలో టీడీపీ నేతలంతా మౌనంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో నోవాటెల్ హోటల్ లో మాజీ మంత్రి గంటా ప్రత్యక్షమయ్యారు.
కొద్ది రోజుల క్రితం గాద్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో చిరంజీవితో గంటా సమావేశమయ్యారు. ఆ సమయంలో చిరంజీవి తాను పవన్ కల్యాణ్ కు మద్దతిచ్చే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ సమయంలో మెగాస్టార్ తో గంటా భేటీ తరువాత ..ఇక గంటా జనసేనకు దగ్గరవుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇటు స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేసారు. కానీ, ఆ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. ప్రజారాజ్యం సమయం నుంచి మెగా బ్రదర్స్ తో గంటాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అయితే, ఆ తరువాతి కాలంలో చిరంజీవి - గంటా మధ్య సత్సంబంధాలు కొనసాగుతన్నా.. పవన్ తో కొంత గ్యాప్ వచ్చింది. కానీ, ఇప్పుడు టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఖాయమనే చర్చలు.. ప్రధానితో పవన్ భేటీ ద్వారా గంటా వేగంగా తన రాజకీయం మొదలు పెట్టారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహం వైసీపీ అమలు చేస్తోంది. విశాఖ నగర ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు గంటా దీనికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో అనుకూలంగానూ ముందుకు రాలేదు. దీంతో పాటుగా.. విశాఖ కేంద్రంగా గంటా ప్రతీ ఎన్నికల్లో తన టీంకు టిక్కెట్లు ఇప్పటించుకోవటం దగ్గర నుంచి గెలిపించుకోవటం వరకు బాధ్యతలు తీసుకుంటారు.
ఇప్పుడు పవన్ బస చేసిన హోటల్ వద్ద ప్రత్యక్షమైన గంటా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ను కలిసేందుకు వచ్చారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. కానీ, పవన్ కల్యాణ్ తో మర్యాద పూర్వక భేటీ జరిగిందని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ ద్వారా భవిష్యత్ కోసం డోర్లు ఓపెన్ చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీ - జనసేన పొత్తు ఉన్నా తన టీంకు ఇబ్బంది లేకుండా చేసుకోవటమే గంటా లక్ష్యంగా తెలుస్తోంది. అదే సమయంలో.. పొత్తు లేకపోతే గంటా టీడీపీలోనే కొనసాగుతారా లేక.. చాలాకాలంగా ప్రచారం సాగుతున్నట్లుగా పార్టీ మార్పు పైన నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications