కేసీఆర్తో గట్టు, విజయ: జగన్కు షాక్, చీఫ్ వ్యూహమా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సీనియర్ నేత గట్టు రామచంద్ర రావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవడం చర్చకు దారి తీసింది. గట్టు రామచంద్ర రావుతో పాటు మరో సీనియర్ నేత జనక్ ప్రసాద్ కూడా కేసీఆర్ను కలిశారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం అంతగా లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ముఖ్యనేతలు తమ దారి చూసుకునే పనిలో పడ్డారని అంటున్నారు. ఎన్నికలకు ముందే పలువురు నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు గట్టు రామచంద్ర రావు, జనక్ ప్రసాద్లు కేసీఆర్ను కలవడంతో వారు తెరాస వైపు చూస్తున్నారా? అనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్లోను ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఎస్పీవై రెడ్డి టీడీపీ వైపు వెళ్లారు. తాజాగా కొత్తపల్లి గీత ఆ జాబితాలో ఉన్నారంటున్నారు. ఇప్పుడు తెలంగాణలోను ముఖ్యనేతలు అధికార తెరాస వైపు చూస్తున్నారు.
వీరి కలయికలో మరో వాదన కూడా వినిపిస్తోంది. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహంతో తెరాసలో చేరదల్చుకున్నారా? లేక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధినేత ఆదేశంతో భేటీ అయ్యారా? అనే చర్చ సాగుతోంది. అయితే, తెరాస సీనియర్ నేత కేకే నివాసంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహరచన సమావేశానికి హాజరు కావడం మరింత చర్చనీయాంశమైంది.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేత విజయా రెడ్డి కూడా కేసీఆర్ను కలిశారు. ఈమె తెరాసలో చేరాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయా రెడ్డి స్వర్గీయ పీజేఆర్ కూతురు.
తెలంగాణలో పలువురు కాంగ్రెసు, టీడీపీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే టీడీపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడైనా గులాబీ కండువా కప్పుకోవచ్చునని అంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications