ఢిల్లీ ఘటనపై మనస్తాపం: గీతారెడ్డి రాజీనామా?

బుధవారం మౌన దీక్ష కోసం జంతర్మంతర్కు బయలు దేరిన ముఖ్యమంత్రిని నిలువరించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహిళా మంత్రుల పట్ల భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల గీతారెడ్డి బాధపడ్డారు.. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ జరగలేదని ఆమె ఆవేదనలో మునిగారు. ఇంత జరిగిన తర్వాత కూడా మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, రాష్ట్రపతి సైతం ఘటనపై విచారణ వ్యక్తంచేసినా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కనీస మర్యాదకైనా మహిళా మంత్రులను సంప్రదించి విచారం వ్యక్తం చేయకపోవడాన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఆ సంఘటనపై, తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై గీతారెడ్డి ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో మాట్లాడారు. బుధవారం నాటి ఘటనతో తాను మనస్తాపానికి గురయ్యానని ఆమె ఆంధ్రజ్యోతితో అన్నారు. ఇంకా మంత్రి పదవిలో కొనసాగరాదని పలువురు నేతలు, నియోజకవర్గ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న మాట కూడా వాస్తవమేనని వివరించారు.
దీనిపై అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా తనను చూసిన వెంటనే కిరణ్ బస్సు దిగుతారని, తమతో మాట్లాడతారని ఊహించామని, కానీ ఇందుకు భిన్నంగా జరిగిందని అన్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications