జిహెచ్ఎంసి ప్రణాళిక: ఒక్క రూపాయికే టిఫిన్

ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాదు జంటనగరాల్లోని ఎనిమిది కేంద్రాల్లో ఐదు రూపాయలకే జిహెచ్ఎంసి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఈ పథకానికి హరికృష్ణ ఫౌండేషన్ సహకరిస్తోంది. పూరీ, ఇడ్లీ, ఉప్మా వంటి అల్పాహారాన్ని ఒక్క రూపాయికే అందించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది.
ఆ విషయాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ సోమశేఖర్ సోమవారంనాడు వెల్లడించారు. ఐదు రూపాయలకు భోజనం అందించే పథకాన్ని ఇప్పటి వరకు 8 కేంద్రాల్లో అమలు చేస్తున్నామని, మరో 42 కేంద్రాలు తెరవాల్సి ఉందని ఆయన చెప్పారు.
త్వరలోనే టిఫిన్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నిరుపేదలకు ఆరోగ్యకరమైన వేడివేడి ఆహారాన్ని అందించానే లక్ష్యంతో ఈ పథకాలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications