చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం: పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు ఎస్సీ బాలికల వసతి గృహంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పరారయ్యాడు.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్

చిత్తూరు: ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగలు తిరుపతి పోలీసులకు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, 8 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏర్పేడు, వడమాలపేట, పుత్తూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో 15 చోట్ల వీరు చోరీలకు పాల్పడినట్టు అర్బన్‌ ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు.

 A girl allegedly raped in Nellore district

గోదావరిలో కానిస్టేబుల్ గల్లంతు

తూర్పుగోదావరి: రాజమండ్రిలోని గోదావరి నదిలో గౌతమి ఘాట్ వద్ద ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు(29) గల్లంతయ్యాడు. శనివారం గోదావరిలో ఈత ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీనివాసరావు స్వస్థలం పిఠాపురం.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం: ఒకరి మృతి

గుంటూరు: సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
A girl allegedly raped in Nellore district on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X