యువతి అశ్లీల నృత్యం, అరెస్టు: బిటెక్ విద్యార్థి మృతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం ముంగమూరు గ్రామంలో అశ్లీల నృత్యాలు చేస్తుండగా పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు ఓ యువతిని అరెస్టు చేశారు.
శ్రీకాకుళంజిల్లాలదోని పలాస రైల్వేస్టేషనులో శుక్రవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. రైల్వేపోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ దగ్గర వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు వ్యాన్ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవరు, క్లీనర్లు మృతి చెందారు. మరో 9మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎటిఎం దొంగల అరెస్టు
చిత్తూరు చిత్తూరు జిల్లాలోని ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను శ్రీకాళహస్తి వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండుకు తరలించారు.