ఊహించని విషాదం: పాట పాడుతూనే కుప్పకూలిన బాలిక..
గుంటూరు: పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా సాగిపోతున్న 'నలుగు' తతంగంలో మృత్యువు విద్యుద్ఘాతం రూపంలో ఓ బాలికను బలితీసుకుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సందడి చేసిన బాలిక.. ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

ఇంతకీ ఏమైంది?:
మాచర్ల మండలంలోని రేగులవరం తండా గ్రామానికి చెందిన వడితె శ్రీను, దరియాల రెండో కుమారుడు సాయికి మే 2న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గరపడటంతో ఇళ్లంతా అలంకరించి అంతా వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం సాయికి నలుగు పెట్టే తంతు నిర్వహించారు.

పాటలు పాడుతుండగా షాక్..:
నలుగు తంతు కోసం బంధువులు, ఇంటిపక్క మహిళలు సాయి ఇంటికి వచ్చారు. ఇదే క్రమంలో సాయి బంధువైన వడితే సునీత(16) కూడా అక్కడికి వచ్చింది. నలుగు పెడుతున్న సమయంలో మహిళలంతా సరదాగా పాటలు పాడారు. సునీత సైతం పాట పాడేందుకని పక్కనే ఉన్న మైక్ అందుకుంది. కానీ ఆ మైక్ ద్వారా విద్యుత్ ప్రసరణ జరగడంతో సునీతకు షాక్ తగిలింది.

స్పృహ కోల్పోయిన సునీత..:
విద్యుత్ షాక్ తగలగానే సునీత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఏమైందో అర్థంకాక అక్కడున్న మహిళలు సునీతను తట్టిలేపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వడితె లక్ష్మి, జమిలి సొమ్మసిల్లిలకు కూడా విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయారు. సునీతను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు.

విషాదఛాయలు:
గాయాలైన మహిళలను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాచర్ల రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం సునీత మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. కూలీ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్న సునీత అకాల మరణంతో ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications