ఘోరం: హాస్టల్ పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య.. ఏం జరిగిందో?
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల వసతిగృహంలో ఉంటూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న నాయక్(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
జంగారెడ్డిగూడెం అర్భన్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల వసతిగృహంలో ఉంటూ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న నాయక్(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్ భవనం పైనుంచి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. స్వప్న తలకు బలమైన గాయం కావడంతో కళాశాల యాజమాన్యం వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించింది.

అయితే అప్పటికే స్వప్న మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు సమాచారం అందుకుని కళాశాలకు చేరుకున్న స్వప్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
పరీక్షల సమయం దగ్గర పడడంతో 15 రోజుల క్రితమే తమ కుమార్తెను వసతిగృహంలో చేర్పించామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ స్వప్న తండ్రి శిశుపాల్ నాయక్ విలపించారు. అయితే స్వప్న ఆత్మహత్య ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications