నేడు బంగారు దుకాణాల బంద్...ప్రత్యేక హోదాకు మద్దతుగా....
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా మార్చి 13 మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా బంగారు దుకాణాల బంద్ నిర్వహిస్తున్నట్లు శ్రీకామాక్షి స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.పోతులూరి ఆచారి తెలిపారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాకు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ సైతం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని స్వర్ణకారులు అంతా బంద్ చేపట్టి ప్రతి జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇవ్వాలని అన్ని జిల్లాల స్వర్ణకార సంఘాలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడలో ఉదయం 10.30 గంటలకు పాతబస్తీలోని పిళ్లా అప్పారావు మార్కెట్ నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications