సినీ ఫక్కీలో బంగారం దోపిడీ, అరెస్ట్ (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖపట్నంలో సంచలనం రేపిన బంగారం దోపిడీ కేసులో నిందితులను కంచరపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 828 గ్రాముల ఎనిమిది బంగారం బిస్కెట్లు, 28 గ్రాముల బంగారం ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్ కమిషనరేట్లో నగర క్రైం ఏడీసీపీ వరదరాజు విలేకరులకు వెల్లడించారు.
దుబాయికి చెందిన నోషద్ వద్ద కైలాసపురం శాంతినగర్కు చెందిన పండూరి నగేష్ మోటర్ మోకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 21న అతడు సెలవుపై నగరానికి వచ్చాడు. నోషద్ గత నెల 21న నగేష్ కు ఫోన చేసి హైదరాబాద్లో మహమ్మద్ షాకీర్ను కలిసి పది బంగారు బిస్కట్లు తీసుకోమని చెప్పాడు.
నగేష్ బంగారు బిస్కెట్లు సాక్సుల్లో పెట్టి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి వాటిని చెన్నైలో ఉన్న షాకీర్కు ఇవ్వాలని అతడు చెప్పాడు. నగేష్ గత నెల 27న చెన్నై వెళ్లేందుకు బస్సు టికెట్ బుక్ చేయాలని శాంతినగర్కు చెందిన దారాపు మోహన్కు పురమాయించాడు.
బంగారం దోపిడీ కేసు నిందితుల అరెస్టు
విశాఖపట్నంలో సంచలనం రేపిన బంగారం దోపిడీ కేసులో నిందితులను కంచరపాలెం పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 828 గ్రాముల ఎనిమిది బంగారం బిస్కెట్లు, 28 గ్రాముల బంగారం ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం దోపిడీ కేసు నిందితుల అరెస్టు
దుబాయికి
చెందిన
నోషద్
వద్ద
కైలాసపురం
శాంతినగర్కు
చెందిన
పండూరి
నగేష్
మోటర్
మోకానిక్గా
పనిచేస్తున్నాడు.
ఈ
ఏడాది
ఆగస్టు
21న
అతడు
సెలవుపై
నగరానికి
వచ్చాడు.
నోషద్
గత
నెల
21న
నగేష్
కు
ఫోన
చేసి
హైదరాబాద్లో
మహమ్మద్
షాకీర్ను
కలిసి
పది
బంగారు
బిస్కట్లు
తీసుకోమని
చెప్పాడు.
బంగారం దోపిడీ కేసు నిందితుల అరెస్టు
నగేష్ బంగారు బిస్కెట్లు సాక్సుల్లో పెట్టి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి వాటిని చెన్నైలో ఉన్న షాకీర్కు ఇవ్వాలని అతడు చెప్పాడు. నగేష్ గత నెల 27న చెన్నై వెళ్లేందుకు బస్సు టికెట్ బుక్ చేయాలని శాంతినగర్కు చెందిన దారాపు మోహన్కు పురమాయించాడు.
బంగారం దోపిడీ కేసు నిందితుల అరెస్టు
ఇంత సడన్గా చెన్నై ఎందుకు వెళుతున్నావని అతడు నగేష్ను అడగ్గా బంగారం బిస్కెట్ల విషయం చెప్పాడు. వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని మోహన్ స్నేహితులైన పరగడ గురునాధరెడ్డి అలియాస్ బాబ్జీ, పొక్కళ్ల శివకుమార్, బత్తిన మురళిలతో కలిసి పథకం వేశాడు.
ఇంత సడన్గా చెన్నై ఎందుకు వెళుతున్నావని అతడు నగేష్ను అడగ్గా బంగారం బిస్కెట్ల విషయం చెప్పాడు. వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని మోహన్ స్నేహితులైన పరగడ గురునాధరెడ్డి అలియాస్ బాబ్జీ, పొక్కళ్ల శివకుమార్, బత్తిన మురళిలతో కలిసి పథకం వేశాడు.
27వ తేదీ సాయంత్ర నగేష్ కావేరీ ట్రావెల్స్ బస్సులో చెన్నై బయలుదేరగా ఊర్వశి జంక్షన్లో బస్సు ఆపి అతడిని కిందకు దింపేశారు. అతడిపై దాడి చేసి పది బం8గారం బిస్కెట్లు దోచుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. రెండు బంగారు బిస్కట్లు కురుపాం మార్కెట్లో ఓ వ్యాపారికి ఇచ్చి రూ. 3 లక్షలు తీసుకుని ఎంజాయ్ చేశారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. గట్టిగా విచారణ చేయడంలో నిందితులను శనివారం ఉదయం బిఎస్.1 టి.ఎస్ కాలనీ వద్ద ఆశీర్వాద్ కల్యాణ మండపం ఎదురుగా గల ఖాళీ ప్రదేశంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.