విజయవాడ-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ కు పల్నాడులో కొత్త హాల్ట్..!
విజయవాడ నుంచి హైదరాబాద్ లోని లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఓ అలర్ట్. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి లింగంపల్లికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక్కడ కీలకమైన పిడుగురాళ్ల (Piduguralla) స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఆదేశాలు ఇవ్వబోతోంది. దీంతో పిడుగు రాళ్ల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది ఉపయోగపడనుంది.
హైదరాబాద్-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ రైలు 12795/12796కు పిడుగు రాళ్ల స్టేషన్ లో హాల్ట్ సౌకర్యం కల్పించాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఈ నెల 11న లేఖ రాశారు. ఈ లేఖకు స్పందిస్తూ ఎంపీ కోరినట్లుగానే పిడుగురాళ్లలో ఈ రైలుకు హాల్ట్ సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీ లావు కృష్ణదేవరాయలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేఖ రాశారు.

దీంతో త్వరలోనే పిడుగు రాళ్ల స్టేషన్లో కీలకమైన విజయవాడ-లింగంపల్లి ఎక్స్ ప్రెస్ రైలు ఆగబోతోంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 7.30కు బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 11.35కు లింగంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి నుంచి బయలుదేరే రైలు తెల్లవారు జామున 4.40కు బయలుదేరుతుంది. ఇది విజయవాడకు ఉదయం 10.35కు చేరుతుంది. ఈ రైలుకు ప్రస్తుతానికి రెండు వైపులా గుంటూరు, నరసరావుపేట, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ లో మాత్రమే హాల్ట్ లు ఉన్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు పిడుగురాళ్ల కూడా హాల్ట్ గా చేరబోతోంది.












Click it and Unblock the Notifications