పాలకవర్గం ఫెయిల్.. అందుకే నిరసనలు, హోం మంత్రి కామెంట్స్పై పవన్ ఫైర్
ఒక్కసారిగా కోనసీమ అట్టుడికింది. జిల్లాకు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో అమలాపురంలో హై టెన్షన్ నెలకొంది. అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని కోరారు.

ఇదీ సరికాదు..
భారత రత్న, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పాలనపర లోపాలను కప్పి పుచ్చుకోవడానికి.. లేని సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితికి కారణం ఎవరనేది రాష్ట్రంలో గల ప్రజలందరికీ తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవీలో ఉన్న హోం మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండించారు.

బాధాకరం
అంబేద్కర్ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని వ్యతిరేకించడం బాధాకరం అని హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేయడంతో మార్చామని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించారని వివరించారు. వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తప్పమని హెచ్చరించారు.

పేరు మార్చడం కుదరదు..?
మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముందని అడిగారు. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని మంత్రులు, నేతలు అంటున్నారు. విపక్షాలు మాత్రం వైసీపీ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications