మజ్లిస్కి షాక్: '04 కేసులో అక్బర్ విచారణకి అనుమతి
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ముఖ్య నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం అనుమతించింది. 2004 ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన పైన కేసు నమోదయింది. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
అక్బరుద్దీన్ ఓవైసీ పైన పలు కేసులు నమోదయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2004 వాటి కేసులో ప్రభుత్వం ప్రాసిక్యూషన్కు ఆమోదించడం ఆయనకు, పార్టీకి ఎదురుదెబ్బే. 2004లో రెచ్చగొట్టే వ్యాఖ్యల పైన చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది.

జైట్లీపై పరువు నష్టం కేసు వెనక్కి
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీపై వేసిన పరువు నష్టం దావా కేసును హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఉపసంహరించుకున్నారు.
వీరభద్ర సింగ్ జనవరిలో మాజీ ముఖ్యమంత్రి పికె ధుమాల్, ఆయన కుమారుడు అనురాగ్ ఠాకూర్, నాటి బిజెపి నేత అరుణ్ జైట్లీలపై పరువు నష్టం దావా వేశారు. అయితే, శుక్రవారం అరుణ్ జైట్లీపై వేసిన కేసును ఆయన వెనక్కి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications