జగన్కు అవమానం?: ప్రోటోకాల్ పట్టించుకోని ప్రభుత్వం, కనీస భద్రత లేకపోతే!..
బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఏసీ రావడం లేదని, పైగా అది శుభ్రంగా కూడా లేదని పోలీసులు మరో వాహనాన్ని తీసుకొచ్చారు.
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఏపీ సర్కార్ అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడికి కేటాయించాల్సిన వాహనాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ ఆరోపణలకు తావిస్తోంది.
తాజాగా బుధవారం నాడు గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అయితే బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ఏసీ రావడం లేదని, పైగా అది శుభ్రంగా కూడా లేదని పోలీసులు మరో వాహనాన్ని తీసుకొచ్చారు.

చేసేదేమి లేక జగన్ కూడా అదే వాహనంలో పర్యటన కొనసాగించారు. తిరుగు ప్రయాణంలో ఆ వాహనం కూడా మంగళగిరి వద్ద పంక్చర్ అయింది. దీంతో ప్రైవేట్ వాహనంలో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి వచ్చింది.
ప్రతిపక్ష నేత విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ ను విస్మరిస్తుందనడానికి ఈ సంఘటనలే నిదర్శనం. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా.. ప్రోటోకాల్ మాత్రం నిక్కచ్చిగా అమలు చేయాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీ పట్ల చిన్న చూపు ఉండవచ్చేమో గానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పార్టీ పోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం వాపోయారు. మరోసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూసుకోవాలని కోరారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications