ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లకు గుడ్ న్యూస్..!!
ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్(డీఏ) మార్చిలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపు తరువాత డీఆర్(DR), డీఏ 50 శాతానికి పైగా చేరుకుంటుంది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. మార్చి 3న జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త వినబోతున్నారు. కరువు భత్యం నాలుగు శాతం పెంచేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. చివరి సారిగా 2023 అక్టోబర్ లో కేంద్రం డీఏని 4 శాతం పెంచింది. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. గతంలో పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్లను ప్రభుత్వం ఆమోదించింది. 2022-2023కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకత లేని బోనస్ల (అడ్ హాక్ బోనస్లు) లెక్కింపు కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.7,000 పరిమితిని నిర్ణయించింది .

దేశ ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, డీఏ మరింత పెరిగే అవకాశం ఉంది. డీఏ, డీఆర్ పెరుగుదలలు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క 12 నెలల సగటు పెరుగుదల శాతం ద్వారా నిర్ణయిస్తారు.
డీఏ మూల వేతనంలో 50.25 శాతానికి సమానంగా ఉంటుంది. ప్రతి నెల పీఐ- ఐడబ్ల్యూ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విభాగమైన లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. డీఏ ఉద్యోగులకు ఇవ్వనుండగా.. డీఆర్ పెన్షనర్లకు చెల్లిస్తారు. డీఏ, డీఆర్ను సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జులైలో ప్రకటిస్తారు. ఇక, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications