గ్రూప్‌-2 పరీక్షలపై ట్విస్ట్‌ ఇచ్చిన ఏపీపీఎస్సీ

గ్రూప్‌-2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు లేదని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. . గ్రూప్- 2 మెయిన్స్‌ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై ఏపీపీఎస్సీ రియాక్ట్ అయింది

Group-2 exams remain as is - APPSC

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.దీంతో ఫిబ్రవరి 23న (ఆదివారం) జరగబోయే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 జరుగుతుందని కమిషన్‌ తెలిపింది.గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం నమ్మొద్దని కమిషన్‌ సూచించింది.అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+