గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గౌహతి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి: ఇద్దరికి గాయాలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చేబ్రోలు మండలం వేజెండ్ల సమీపంలో చోటుచేసుకుంది. దుండగులు జరిపిన రాళ్లదాడిలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఓ ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన మహామూర్లి ఆగివున్న రైలు నుంచి దిగి ఇంజిన్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది అడ్డుకోవడంతో తిరిగి బోగిలోకి ఎక్కుతుండగా ప్రయాణికులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మహామూర్లి ప్రయాణీకులపై రాళ్లు విసిరాడు.

ఈ దాడిలో ఇద్దరు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.

Guwahati Express attacked with stones by thugs in Guntur

రోడ్డు ప్రమాదంలో 14మందికి గాయాలు

అనంతపురం జిల్లా విడవనకల్ వద్ద బస్సు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విడపనకల్, ఉరవకొండ ఆస్పత్రులకు తరలించారు.

English summary
A person on Tuesday attacked with stones on Guwahati Express in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X