లోకేశ్ యువగళం ముందే ముగింపు - అసలు కారణం అదేనా..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన రాజకీయ దాడి పెంచాయి. అటు పవన్ వారాహి యాత్ర..ఇటు లోకేశ్ యువగళం యాత్రలతో పాటుగా చంద్రబాబు జిల్లాల పర్యటనలో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ సమయంలోనే నారా లోకేశ్ యువగళం యాత్ర షెడ్యూల్ కంటే ముందుగానే ముగించే ఆలోచన జరుగుతోంది. దీనికి అసలు కారణం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
పాదయాత్ర కుదింపు: టీడీపీ ముఖ్య నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర షెడ్యూల్ మారే అవకాశం కనిపిస్తోంది. యాత్రను ముందుగానే ముగించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండలో జరుగుతుంది. లోకేశ్ పోటీ చేయనున్న మంగళగిరి మీదుగా ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించనుంది.

జనవరి 27 నుంచి ప్రారంభించిన పాదయాత్ర 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు పాటు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ను పార్టీ నాయకత్వం రూపొందించింది. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది మార్చి 1తో యాత్ర ముగించాల్సి ఉంది. మార్చిలో ఎన్నికల కోడ్తో పాటు షెడ్యూల్ కూడా రానుంది. ఈ సమయంలో లోకేశ్ యాత్రను కుదించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల కసరత్తు వేళ: అభ్యర్థుల ప్రకటన, యాత్ర రెండింటిపై పార్టీ దృష్టి సారించడం ఇబ్బందికరమవుతుందని భావిస్తున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్లో రోజులు మాత్రం తగ్గుతాయని, కిలోమీటర్లలో మార్పు ఉండదని నాయకులు అంటున్నారు. 400 రోజులకు సగటున రోజుకు 10 కిలోమీటర్ల పాటు సాగాలని ముందుగా నిర్ణయించుకోగా, ప్రస్తుతం అది సగటున 15 కిలోమీటర్లు సాగుతోంది. ఇప్పటి వరకు 185 రోజులు పూర్తయింది.
కొద్ది ప్రాంతాలు మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ లోకేశ్ యాత్రకు స్పందన బాగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో7 రోజులపాటు 4 నుంచి 5 నియోజకవర్గాలకే పరిమితం కానుంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం 60 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలు కీలకం కావటంతో ఎక్కవ సమయం కేటాయించనున్నారు.

పొత్తులు..సీట్ల ఖరారులో: గోదావరి జిల్లాల్లో ముగిసిన అనంతరం ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి నవంబరు చివరి నాటికి పూర్తి చేసేలా పార్టీ రూట్మ్యాప్ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జనసేన తో పొత్తు వేళ సీట్ల లెక్కలు..అభ్యర్ధుల ఎంపిక కీలకం కానుంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పవన్ ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న ప్రసంగాలతో ఉపయోగం ఉన్నా..పవన్ లో వస్తున్న మార్పు .. బీజేపీతో సంబంధాల అంశాన్ని టీడీపీ నిశితంగా గమనిస్తోంది.
దీంతో, యాత్రలో వేగం పెంచి లక్ష్యం చేరుకొనేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల పొత్తులు..సీట్ల విషయంలో లోకేశ్ పాత్ర కీలకం కానుంది. ఈ కసరత్తు ఎన్నికల వేళ కీలకం కావటంతో యాత్రను కుదించే దిశగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications