Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు మరో చిక్కు: వేధింపుల కేసు పెట్టిన భార్య

విజయవాడ: ఆయనో మాజీ ఎమ్మెల్యే. యువకుడిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేసిన సదరు నేత.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఇలావుండగా, ఆయన ఇటీవలే ఓ యువతిని పెళ్లి చేసుకున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. తనను నమ్మి వచ్చిన ఆ యువతికి బాగా చూసుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఎన్నో ఆశలతో ఆ నేత ఇంట కాలు మోపిన ఆ యువతి షాక్ తింది. అతని వేధింపులు భరించలేక ఆ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకెళితే.. ఇప్పటికే కాల్‌మనీ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. కాల్ మనీ కేసు నేపథ్యంలో ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సతీమణి సోమవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మురళీకృష్ణపై వేధింపుల కేసు నమోదు చేశారు.

అధికారులపై జగన్ పార్టీ ఎమ్మెల్యే వీరంగం

Harassment case filed on YSRCP former MLA

ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పెద్ద కలకలమే రేపారు. జగన్ వ్యాఖ్యలపై మూకుమ్మడిగా దాడి చేసిన టీడీపీ మంత్రులు, పార్టీ వర్గాలు ఆయనను దుమ్మెత్తిపోశాయి.

కాగా, ఈ వ్యవహారం కాస్తంత సద్దుమణిగిన నేపథ్యంలో సోమవారం జగన్ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే ఇదే తరహా అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన విరుచుకుపడింది టిడిపి నేతలపై కాదు.. ప్రభుత్వ ఉద్యోగులపై. ఎమ్మెల్యే బూతు పురాణంంతో షాక్‌కు గురైన అధికారులు ఆయనపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకెళితే.. కడప జిల్లా మైదుకూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి సోమవారం ప్రభుత్వం నిర్వహించిన ఏరువాకలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో మైదుకూరులో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు వచ్చిన రఘురామిరెడ్డి... అధికారులపై దురుసుగా ప్రవర్తించారు.

'వ్యవసాయ శాఖలో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అంతా మోసపూరితమే. ఏ ఒక్క అధికారి కూడా నీతి నిజాయతీ ఎరుగరు. మీ కథ తేలుస్తా. చెప్పులతో కొట్టిస్తా. ఊళ్లోకి రానివ్వకుండా చేస్తా' అని ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత ఆయనను సాగనంపేందుకు కారు దాకా వెళ్లిన ఓ అధికారిపై ఆయన ఏకంగా బూతు పురాణం వినిపించారట. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆవేదన చెందిన ఆ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+